Srikakulam District: రిమ్స్ ఘటన దురదృష్టకరం: మంత్రి అచ్చెన్నాయుడు

  • ఇంజక్షన్ వికటించిన ఘటనలో ముగ్గురి మృతి  
  • మానవ తప్పిదమే అయితే కఠిన చర్యలు 
  • ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన మంత్రి 

శ్రీకాకుళం రిమ్స్ లో ఇంజక్షన్ వికటించిన కారణంగా ఇటీవల ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ ఘటనకు మానవ తప్పిదమే కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయడు హెచ్చరించారు. ఈరోజు రిమ్స్ ను ఆయన సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, రిమ్స్ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని అన్నారు. 21 మంది రోగుల్లో ముగ్గురు చనిపోయారని, ఒకరు డిశ్చార్జ్ అయ్యారని, ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని నిపుణుల కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. 

More Telugu News