Tamilnadu: 2 వేల కేజీల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించిన భక్తులు

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మహాళీ అమ్మాన్ ఆలయం పండ్లతో నిండిపోయింది. దీంతో ఆలయం కొత్త కళను సంతరించుకుంది. ఆది  పండుగలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా పూజలు నిర్వహించిన భక్తులు మహాళీ అమ్మాన్ ఆలయం అణువణువునూ పండ్లతో నింపేశారు. మామిడి, పైనాపిల్, పియర్స్, అరటి తదితర మొత్తం 26 రకాల 2 వేల కిలోల పండ్లను ఇందుకోసం ఉపయోగించారు. అమ్మవారి విగ్రహానికి పండ్లను దండగా కూర్చి అలంకరించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం పండ్లను భక్తులు, నగరంలోని పేదలకు పంచిపెట్టనున్నారు.
Go Back to Shorts
Tamilnadu
Coimbatore
decoration
fruits

More Telugu News