Pawan Kalyan: కాలు బెణికినప్పటికీ.. ప్రజాపోరాట యాత్రకు సిద్ధమవుతున్న పవన్!
ప్రజాపోరాట యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాలు బెణికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స చేయించుకున్నారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.
అయితే, ప్రజా పోరాట యాత్రను కొనసాగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఆయన పోరాట యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన... భీమవరంలోని ఎస్సీ కాలనీలో విద్యార్థులు, దేవాలయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించనున్నారు.
అయితే, ప్రజా పోరాట యాత్రను కొనసాగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి ఆయన పోరాట యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన... భీమవరంలోని ఎస్సీ కాలనీలో విద్యార్థులు, దేవాలయ సిబ్బందితో ముఖాముఖి నిర్వహించనున్నారు.