Telugudesam: రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాం: ఏపీ మంత్రి అఖిలప్రియ
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుగు దేశం పార్టీ ఎంపీలు నిన్న పార్లమెంట్ లో ఆవిష్కరించిన విధానాన్ని ఏపీ మంత్రి అఖిలప్రియ ప్రశంసించారు. రాజ్యాంగంపై ప్రజలకున్న చిన్నపాటి విశ్వాసాన్ని, ఆశను నరేంద్ర మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా గట్టిగా నిలబడి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె అన్నారు.