Krishna District: కృష్ణా జిల్లాలో కలకలం... విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకుపోయిన టీచర్!

  • ప్రేమికుడిగా మారిన ఉపాధ్యాయుడు
  • టెన్త్ చదువుతున్న విద్యార్థికి ప్రేమపాఠాలు
  • సెల్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో అరెస్ట్

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రేమికుడు అయ్యాడు. తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునే అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకుపోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపగా, పోలీసులు నిందితుని సెల్ ఫోన్ సిగ్నల్స్  ఆధారంగా రాజమండ్రిలో అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, అరిగిపల్లి మండలం గోపాలపురానికి చెందిన ఓ బాలిక ప్రైవేటు స్కూల్ లో టెన్త్ చదువుతోంది. అక్కడే నూజివీడు మండలానికి చెందిన గోళ్ల గణేశ్ అనే యువకుడు టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన గణేష్, మంగళవారం రాత్రి ఆమెను తీసుకుని ఊరు వదిలిపోయాడు.

బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, గణేష్ మొబైల్ సిగ్నల్స్ రాజమండ్రిలో ఉన్నాయని తెలుసుకుని, అక్కడికి ప్రత్యేక టీమ్ ను పంపి వారిద్దరినీ స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు, గణేష్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

More Telugu News