TTD: తిరుమల శ్రీవారికి ప్రవాసాంధ్రుల భారీ విరాళం!
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీనివాస్, రవి అనే భక్తులు కలిసి ఏకంగా రూ.13.50 కోట్ల భారీ విరాళం అందజేశారు. దీనిలో రూ.10 కోట్లు స్వామివారి హుండీకి సమర్పించగా, రూ. 3.50 కోట్లు టీటీడీ నిర్వహిస్తోన్న వివిధ ట్రస్ట్ లకు ఇచ్చారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్రెడ్డి సమక్షంలో టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్యాదవ్కు ఈ విరాళానికి సంబంధించిన చెక్కులను వారు అందజేశారు. భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన శ్రీనివాస్, రవిలను టీటీడీ అధికారులు సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.