Chandrababu: తాడిపత్రి ఘటన బాధాకరం: సీఎం చంద్రబాబు

  • ఈ ప్రమాదంపై అధికారులతో సమీక్షించా
  • బాధితులకు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించా
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాం
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో  గ్యాస్‌ లీకై ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు పరిశ్రమలో గ్యాస్‌ లీకై ఆరుగురు మృతి చెందిన ఘటన బాధాకరం. ప్రమాదంపై అధికారులతో సమీక్షించి బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించాము. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నాము’ అని చంద్రబాబు పేర్కొన్నారు.  
Chandrababu
tadipatri

More Telugu News