railway: ఇకపై మొబైల్ యాప్ ద్వారా సాధారణ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు!

షార్ట్స్‌లో చూడండి
ఇకపై రైల్వే సాధారణ ప్రయాణికులు తమ టికెట్లను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో యూటీఎస్ ఆన్ లైన్ మొబైల్ యాప్ ను దక్షిణ మధ్య రైల్వే రూపొందించింది. ఈ యాప్ ను దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ ఈరోజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లు లేని సాధారణ ప్రయాణికుల కోసం యూటీఎస్ యాప్ ను ఆవిష్కరించామని, ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్లాట్ ఫాం టికెట్లను కూడా దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని, యూటీఎస్ యాప్ సేవలను త్వరలోనే దేశ వ్యాప్తంగా అందిస్తామని అన్నారు.
Go Back to Shorts
railway
general passangers

More Telugu News