నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న నితిన్ గడ్కరీ
- చంద్రబాబుతో కలసి పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న గడ్కరీ
- రెండు గంటల సేపు ప్రాజెక్టు వద్ద గడపనున్న కేంద్ర మంత్రి
- కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులతో సమీక్ష
పర్యటన సందర్భంగా చంద్రబాబుతో కలసి ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలిస్తారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలతోను, అధికారులతోను పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. సుమారు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. గడ్కరీ పర్యటన వల్ల ఉపయోగం ఉంటుందని... పనులు మరింత వేగంగా సాగడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.