stock market: జోరు కొనసాగింది.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఐదు నెలల గరిష్ట స్థాయికి పెరిగిన సెన్సెక్స్
  • 305 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 10,947 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఐదు నెలల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 305 పాయింట్లు పెరిగి 36,240కి ఎగబాకింది. నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 10,947 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ట్రైడెంట్ లిమిటెడ్ (11.99%), మ్యాక్స్ ఇండియా (9.09%), ఐడీబీఐ బ్యాంక్ (9.02%), రతన్ ఇండియా పవర్ (7.43%), ప్రజ్ ఇండస్ట్రీస్ (6.98%).  

టాప్ లూజర్స్:
క్వాలిటీ (4.09%), మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (3.83%), హెక్సావేర్ టెక్నాలజీస్ (2.99%), బ్లూ స్టార్ (2.95%), డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ (2.22%).   
stock market
sensex
nifty

More Telugu News