CM Ramesh: సీఎం రమేష్ దీక్షకు మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ మద్దతు

  • రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది
  • అయినా దీక్షను కొనసాగించడం ప్రశంసనీయం: లక్ష్మీనారాయణ
  • రమేష్ ను పరామర్శించిన నిర్మాత బండ్ల గణేశ్

ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణేశ్ లు రమేష్ ను పరామర్శించి తమ మద్దతు తెలిపారు. అనంతరం, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఉక్కు దీక్షను కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు.
ఆయన పట్టుదల రోజురోజుకీ పెరుగుతోంది: సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి

సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ, ‘రమేష్ గారి గుండె, లివర్, ఊపిరితిత్తులపైన ఎంత ప్రభావం పడుతున్నదో వైద్యులు వివరించి చెప్పినప్పుడు ఆయన భార్యగా నేను, మా పిల్లలు, కుటుంబంలోని అందరం చాలా ఒత్తిడికి గురయ్యాం. వైద్యులు చెప్పినప్పటి నుంచి భయమేస్తోంది. ఆయన (రమేష్) పట్టుదల రోజురోజుకీ పెరుగుతోందే కానీ, ఆయన ఏమాత్రం భయపడట్లేదు. ఆ పట్టుదల చూసినప్పుడు పోరాడేందుకు భగవంతుడు ఆయనకు ఇంకా శక్తి నిస్తాడని అనిపిస్తోంది. దేవుడిని మేము ప్రార్థించేది కూడా అదే’ అని అన్నారు.

More Telugu News