బీటెక్ రవి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: చంద్రబాబు
- అవినీతిపరులంతా ఒకవైపు చేరారు
- కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకులా మారారు
- స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు ఉద్ధృతం చేయండి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి అద్దె మైకులా మారారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ-వైసీపీల దొంగ నాటకాలను బయటపెట్టాలని, గాలి-బీజేపీ-జగన్ ల లూలూచీని ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఢిల్లీలో కలిసిన వైనాన్ని ఎండగట్టాలని చెప్పారు. తిరుమల వెంకన్న ప్రతిష్ట దిగజారేలా రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. శ్రీవారి నగలను ప్రదర్శనకు పెట్టడం మంచిది కాదని అర్చకులు చెబుతున్నారని తెలిపారు.