Mahesh Babu: మహేశ్ బాబు మూవీలోను అదితీ రావు!

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్ర కోసం అదితీ రావును తీసుకున్నారనేది తాజా సమాచారం.

రీసెంట్ గా రిలీజైన 'సమ్మోహనం' సినిమాలో అదితీ రావు కథానాయికగా నటించింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. అదితీ రావు నటనను మహేశ్ బాబు అభినందించడం .. 'సమ్మోహనం' సక్సెస్ టాక్ తెచ్చుకోవడం ఆమెకి ఈ ఛాన్స్ వచ్చేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. అదితీ రావు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది.       
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News