ramana dikshitulu: రమణ దీక్షితులు.. ఫాదర్ దీక్షితులుగా మారారు: హిందూ ధర్మ రక్ష సమితి అధ్యక్షుడు

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుపై గుంటూరు జిల్లా హిందూ ధర్మ రక్ష సమితి అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రమణ దీక్షితులు ఫాదర్ దీక్షితులుగా మారారని, ఆయన్ని తిరుమల కొండపైకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. రమణ దీక్షితులకు గతంలో మద్దతు పలికినందుకు తాను సిగ్గుపడుతున్నానని అన్నారు.
ramana dikshitulu
hindu dharma raksha samithi

More Telugu News