Andhra Pradesh: నరేంద్ర మోదీ ముందు చంద్రబాబు ఎక్స్ ప్రెషన్ చూశారా?: బొత్స

  • ఢిల్లీ వెళ్లి సృష్టించిన భూకంపం ఇదేనా?
  • మోదీకి వంగివంగి దండాలా?
  • చంద్రబాబు ముఖంలో భయం కనిపించింది
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ
న్యూఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని విపక్ష పార్టీల సీఎంలు కలిసిన వేళ, తీసిన ఫొటోలను చూపిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, చంద్రబాబు వైఖరిని ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీ వెళ్లి భూకంపం పుట్టిస్తారని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తారన్న ప్రచారం జరిగిందని, ఆఖరికి మోదీకి వంగివంగి దండాలు పెట్టారని విమర్శించారు.

మోదీని కలిసిన వేళ, చంద్రబాబు ముఖంలో కనిపించిన ఎక్స్ ప్రెషన్ లో భయాన్ని కవర్ చేసుకోవడం స్పష్టంగా తెలుస్తోందని, అది ఓ వికృత నవ్వని అన్నారు. నాటకాలు ఆడే విషయంలో తనంతటి వారు లేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుది పోరాడే నైజం కాదని, అందితే జుట్టు, అందకుంటే కాళ్లు పట్టుకునే రకమని చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Botsa Satyanarayana
Chandrababu

More Telugu News