Karnataka: కర్ణాటకలో కీలక స్థానమైన ఆర్ ఆర్ నగర్లో నేడు పోలింగ్... గెలిచేది ఎవరు?

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక రాష్ట్రంలో నేడు ఆసక్తిదాయకమైన ఎన్నిక జరుగుతోంది. రాజరాజేశ్వరి నగర్ శాసనసభ స్థానానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది. ఇటీవల ఎన్నికల సమయంలో ఈ స్థానానికి పోలింగ్ ను వాయిదా వేశారు. ఈ నియోజకవర్గంలోని ఓ ఫ్లాట్ లో 10,000 ఓటర్ ఐడెంటిటీ కార్డులు మే 8న బయటపడడం వాయిదా వేయడానికి కారణం. అనంతరం ఇక్కడ ఎన్నికకు మే 28వ తేదీని ముహూర్తంగా ఈసీ నిర్ణయించింది.

దీంతో ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 221 స్థానాలకు గాను బీజేపీ 104 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం విదితమే. అయితే, జేడీఎస్-కాంగ్రెస్ రెండూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రజల తీర్పును అవహేళన చేశారని బీజేపీ విమర్శలు కూడా చేసింది. అయితే, ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతోంది.    
Go Back to Shorts
Karnataka
rr nagar
election

More Telugu News