Jana Sena: రేపు కూడా పవన్‌ కల్యాణ్‌ 'జన పోరాట యాత్ర'కు విరామం!

  • పవన్‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందికి గాయాలు
  • ఈరోజు జరగని యాత్ర
  • ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న జనసేన
  • ఎల్లుండి నుంచి యాత్ర మళ్లీ కొనసాగుతుందని ప్రకటన
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న 'జన పోరాట యాత్ర'కు వరుసగా రెండో రోజు కూడా బ్రేక్‌ పడింది. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో మొదలైన పవన్‌ కల్యాణ్‌ యాత్ర నిన్న అదే జిల్లాలోని టెక్కలి వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే, పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, దీంతో సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని తెలిపిన జనసేన.. ఈ పర్యటనలో భద్రతా సిబ్బందిలో 11 మంది గాయపడ్డారని పేర్కొంది.

కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉందని అందుకే ఈరోజు జన పోరాట యాత్ర జరగదని నిన్న ప్రకటించింది. తాజాగా ఈ రోజు కూడా ఓ ప్రకటన విడుదల చేసి... 'పవన్‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది గాయాల నుండి పూర్తిగా కోలుకోనందున 25.05.2018 (శుక్ర‌వారం) నాడు కూడా ఆయ‌న కార్య‌క్ర‌మాలు ర‌ద్ద‌య్యాయి. 26.05.2018( శ‌నివారం) నుంచి పోరాట యాత్ర కొన‌సాగుతుంది' అని పేర్కొంది.               
Jana Sena
Pawan Kalyan
Srikakulam District

More Telugu News