truck: పొద్దున్నే తెల్లారిన బతుకులు.. ట్రక్కు బోల్తాపడి 19 మంది దుర్మరణం
- గుజరాత్లో ఘటన
- సిమెంట్ బస్తాలు మీదపడడంతో ఊపిరాడక మృతి
- పరారీలో ట్రక్ డ్రైవర్
గుజరాత్లో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ బస్తాలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భావ్నగర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై బవల్యాలి సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సిమెంట్ బస్తాలు మీద పడడంతో ఊపిరి ఆడక చాలామంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సుల్తాన్పూర్ వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బవల్యాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
సిమెంట్ బస్తాలు మీద పడడంతో ఊపిరి ఆడక చాలామంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా సుల్తాన్పూర్ వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే బవల్యాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.