జగన్ సమక్షంలో వైసీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత తన అనుచరులతో కలిసి ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఆమెని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. మద్దాల సునీత 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఇవాళ్టి జగన్ ప్రజాసంకల్ప యాత్ర గోపాలపురం నియోజకవర్గం, రాజుపాలెం నుండి ప్రారంభమైంది.


More Telugu News