West Bengal: పశ్చిమబెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ ప్రభంజనం

  • 1,800 స్థానాల్లో తృణమూల్ ముందంజ
  • సీపీఎం, బీజేపీ 100 చోట్లే ఆధిక్యం
  • రాత్రికి స్పష్టమైన ఫలితాలు
పశ్చిమబెంగాల్లో తనకు తిరుగులేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిరూపించారు. రాష్ట్రంలో ఈ నెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ సంఖ్యలో స్థానాలను గెలుచుకోనుందని ఫలితాలు తెలియజేస్తున్నాయి. 621 జిల్లా పరిషత్ లు, 6,123 పంచాయతీ సమితులు, 31,802 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల జరగ్గా ఈ రోజు కౌంటింగ్ జరుగుతోంది.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ను పర్యవేక్షిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ 1,800 గ్రామ పంచాయతీల్లో ముందుంది. సీపీఎం, బీజేపీ కేవలం 100 సీట్లలోనే ముందున్నాయి. రాత్రికి గానీ పూర్తి ఫలితాలు తెలిసే అవకాశం లేదు.
West Bengal
panchayi elections

More Telugu News