హ్యాక్కు గురైన పీఎఫ్ పోర్టల్.. రిస్క్లో 2.7 కోట్ల మంది డేటా!
- మార్చిలో ఈపీఎఫ్వో వెబ్సైట్ హ్యాక్
- సమాచార మంత్రిత్వ శాఖకు స్వయంగా లేఖ రాసిన ఈపీఎఫ్వో కమిషనర్
- అటువంటిదేమీ లేదన్న ఈపీఎఫ్వో
‘సీక్రెట్ ’ పేరుతో ఇంటెలిజెన్స్ బ్యూరోకు కమిషనర్ రాసిన లేఖలో వెబ్సైట్లోని లోపాలే డేటా లీకేజీకి కారణమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2.7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల డేటా లీక్ అయినట్టు వార్తలు రావడంతో స్పందించిన ఈపీఎఫ్వో అటువంటిదేమీ జరగలేదని పేర్కొంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. డేటా లీక్కు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పడేసింది. ఆధార్ను అనుసంధానం చేసే సైట్ను మరింత మెరుగ్గా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకే ప్రస్తుతం దానిని మూసివేసినట్టు తెలిపింది.