Cricket: వన్డేల్లో అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా

  • వన్డేల్లో అగ్రస్థానంలో ఇంగ్లండ్‌
  • రెండో స్థానంలో టీమిండియా
  • టీ 20ల్లో మూడో స్థానంలో కోహ్లీ సేన

నిన్న ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం నిన్నటి వరకు 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. ఈ రోజు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఓ పాయింటు కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది. మరోవైపు ఇంగ్లండ్‌ 8 పాయింట్లు మెరుగు పర్చుకుని 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2015-16, 2016-17 సీజన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంకులను ప్రకటించింది.

వన్డేల్లో భారత్‌ తరువాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా (113), న్యూజిలాండ్‌ (112), ఆస్ట్రేలియా (104) ఉన్నాయి. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో 130 పాయింట్లతో పాక్‌ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (115) ఉన్నాయి.     

More Telugu News