2019లో మెగా కూటమిని ఏర్పాటు చేస్తాం.. కొత్త పార్టీలు చేరబోతున్నాయ్: అమిత్ షా
- మోదీ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు
- మాల్యా, నీరవ్ మోదీల స్కాంలు యూపీఏ హయాంలో జరిగినవే
- కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధిస్తాం
గత నాలుగేళ్ల మోదీ పాలనలో కుంభకోణాలు చోటు చేసుకోలేదని... బీజేపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని అమిత్ షా చెప్పారు. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని... దీనికి తమ విధానాలు, పనితీరే కారణమని తెలిపారు. అట్టడుగు స్థాయికి పాలనను తీసుకెళ్లడమే తమ విజయమని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించానని... కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతా వీస్తున్నాయని చెప్పారు. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని వాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేస్తోందని... ఉగ్రవాదానికి మతం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి తాము ఎన్నడూ మతం రంగు పూయలేదని చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని... ఆ అంశంతో బీజేపీ నేతలెవరికీ సంబంధం లేదని అన్నారు.