Pawan Kalyan: అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

  • ఈ నెల 15, 16వ తేదీల్లో పవన్ పర్యటన
  • ప్రజల సమస్యలు తెలుసుకోనున్న జనసేనాని
  • వామపక్ష నేతలతో పాటు ‌రౌండ్ టేబుల్‌ సమావేశం
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మరోసారి అనంతపురంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో ఆయన అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటారు. పవన్ పర్యటనలో వామపక్ష నేతలు కూడా పాల్గొంటారు. అలాగే, అనంతపురంలో పలువురు నేతలతో కలిసి ఏర్పాటు చేయనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలోనూ పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అనంతపురం జిల్లాలోని తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా పవన్ కల్యాణ్ చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. 
Pawan Kalyan
Anantapur District
Jana Sena

More Telugu News