Jagan: మీ పోరాటం, త్యాగం చరిత్రలో నిలిచిపోతాయి: జగన్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరావాలని.. హోదా, విభజన హామీలను నెరవేర్చాలని వీరు చేస్తున్న పోరాటం నిజంగా హర్షించదగ్గ విషయం అని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. 5కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన వెంటనే ఆమరణ దీక్షకు కూర్చోవడం బహుశా దేశ చరిత్రలోనే తొలిసారి అని, వీరి త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని జగన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh
New Delhi

More Telugu News