YSRCP: విజయసాయిరెడ్డితో దళారీ పనులు చేయిస్తున్నారు: మంత్రి దేవినేని

  • జగన్ కేసుల నుంచి బయటపడేందుకే ఈ పనులు చేయిస్తున్నారు
  • నాడు యూపీఏ సర్కార్ తో జగన్ కుమ్మక్కయ్యాడు
  • రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డితో రాజీనామా చేయించరే? ; దేవినేని విమర్శలు
విజయసాయిరెడ్డితో దళారీ పనులు చేయించి కేసుల నుంచి బయటపడాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలు అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్ కోసం నాడు యూపీఏ సర్కార్ తో కుమ్మక్కయ్యారని, నేడు కేసుల మాఫీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డిలతో జగన్ ఎందుకు రాజీనామా చేయించట్లేదు? కేవలం వైసీపీ చెందిన లోక్ సభ సభ్యులతోనే రాజీనామా డ్రామాలేంటి? అని ప్రశ్నించారు. 

More Telugu News

YSRCP
Jagan
devineni