air india: విమాన‌ంలో మాంసాహారం ఇచ్చిందని.. అమ్మాయి చెంపఛెళ్లుమనిపించిన క్రూ సభ్యుడు

  • మరో వివాదంలో ఎయిరిండియా విమాన‌యాన సంస్థ
  • విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుడికి మాంసాహార భోజనం
  • తాను శాకాహారిని అని చెప్పిన ప్రయాణికుడు
  • ఆగ్రహం వ్యక్తం చేసి అమ్మాయిపై చేయి చేసుకున్న క్రూ సభ్యుడు

ఎయిరిండియా విమాన‌యాన సంస్థ మ‌రో వివాదంతో వార్త‌ల్లోకెక్కింది. శాకాహారి అయిన ఓ ప్ర‌యాణికుడికి మాంసాహారం ఇచ్చిందని ఓ క్రూ సభ్యుడు తన జూనియర్ అయిన ఓ అమ్మాయిపై చేయిచేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించామ‌ని సంబంధిత అధికారులు చెప్పారు. కేబిన్‌ అటెండెంట్‌ అయిన అమ్మాయి న్యూఢిల్లీ-ఫ్రాంక్ఫర్డ్ ‌ విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికుడికి మాంసాహార భోజనం ఇచ్చింద‌ని,
అనంత‌రం ఈ విష‌యంపై క్యాబిన్‌ సూపర్‌వైజర్‌కు ప్ర‌యాణికుడు స‌మాచారం ఇచ్చాడ‌ని అధికారులు తెలిపారు.

ఆ ప్ర‌యాణికుడు శాకాహారి అయితే మాంసాహారం ఎందుకు ఇచ్చావని ఆ అమ్మాయిపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రూ సభ్యుడు ఆమె చెంపఛెళ్లుమనిపించాడని తెలిపారు. దీంతో ఎయిరిండియా ఇన్‌ఫ్లైట్‌ సర్వీసు డిపార్ట్‌మెంట్‌కు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిందని వివరించారు.   

More Telugu News