dinesh kartik: ధోనీని చూస్తూ ఎదిగాను..ఇప్పుడంతా నా గురించే మాట్లాడుతున్నారు: దినేష్ కార్తీక్

  • ఫినిషింగ్ లో ధోనీ యూనివర్సిటీ టాపర్
  • మా ఇద్దరి ప్రయాణాలు వేరు
  • మా ఇద్దర్నీ పోల్చడం సరికాదు

ధోనీని చూస్తూ ఎదిగిన వారిలో తానూ ఒకడినని నిదహాస్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ హీరో దినేష్ కార్తీక్ తెలిపాడు. చెన్నైలో దినేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందరూ తన గురించే మాట్లాడుతున్నారని అన్నాడు. ఇదంతా కొన్నేళ్ల శ్రమ అని చెప్పాడు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని అన్నాడు. మ్యాచ్ ఫినిషింగ్ లో ధోనీ యూనివర్సిటీ టాపర్ అయితే తానింకా విద్యార్థినని పేర్కొన్నాడు.

తమ ఇద్దరి ప్రయాణాలు వేర్వేరని పేర్కొన్నాడు. ధోనీ అద్భుతమైన వ్యక్తి అని డీకే చెప్పాడు. ఒకప్పుడు సిగ్గరిగా ఉన్న ధోనీ నేడు యువకులకు అండగా నిలిచే వ్యక్తిగా మారాడని పేర్కొన్నాడు. ధోనీతో తనను పోల్చడం సరికాదని చెప్పాడు. ప్రస్తుతం తానున్న స్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పాడు. నైట్ రైడర్స్ కెప్టెన్ గా కొత్తగా ఏం చేయనున్నానో త్వరలోనే చూస్తారని దినేష్ కార్తీక్ తెలిపాడు.

More Telugu News