prabhas: ప్రభాస్ క్రేజ్ నన్ను టెన్షన్ పెడుతోంది: పూజా హెగ్డే

  • ప్రభాస్ ఒక రేంజ్ వున్న హీరో  
  • ఆయన జోడీగా చేయాలంటే కంగారే 
  • అయినా నన్ను నేను నిరూపించుకుంటాను

బాలీవుడ్ కి వెళ్లి వచ్చిన పూజా హెగ్డేకి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవచ్చని కొంతమంది అనుకున్నారు. తెలుగులో కథానాయికల పోటీ గట్టిగానే ఉండటంతో, వెనక్కి వచ్చిన ఈ సుందరిని అవకాశాలు వెతుక్కుంటూ రావడం కష్టమేనని చెప్పుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆమె బన్నీతో 'దువ్వాడ జగన్నాథం' చేసింది. ఆ తరువాత ఆమె ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ ల తదుపరి చిత్రాలలో అవకాశాలను సంపాదించుకుంది.

నిజంగా ఇది తన అదృష్టమని చెబుతూ .. ప్రభాస్ తో చేయనున్న సినిమాను గురించి ఆమె ప్రస్తావించింది. " 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటి వెళ్లింది. ఆయనకి గల క్రేజ్.. ఇమేజ్ అంతా ఇంతా కాదు. అది తలచుకున్నప్పుడే నాకు టెన్షన్ అవుతోంది. అయినా నేను బెదిరిపోకుండా .. దర్శకుడు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఈ సినిమాతో నన్ను నేను నిరూపించుకుని .. మరింత మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.    

More Telugu News