nithya menon: ఒకే సినిమాకి ఓకే చెప్పేసిన నిత్యామీనన్ .. సాయిపల్లవి

  • దర్శకుడిగా శంతను భాగ్యరాజ్ 
  • నిర్మాతగా .. దర్శకుడు మిస్కిన్
  • కథానాయికలు ఖరారు      

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా నిత్యామీనన్ కి మంచి క్రేజ్ వుంది. ఇక సాయిపల్లవి కూడా అదే బాటలో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఇప్పుడు ఒక తమిళ సినిమాలో కలిసి నటించనుండటం విశేషం.

ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ ఒక సినిమాకి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం నిత్యామీనన్ ను .. సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నాడు. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. నటుడిగానే కాదు .. దర్శకుడిగానూ కె. భాగ్యరాజ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన తనయుడిగా శంతను భాగ్యరాజ్ కూడా రాణిస్తాడేమో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

More Telugu News