Ravela Kishore Babu: రావెల కిషోర్ బాబు మాటలపై మండిపడ్డ మంత్రి జవహర్
టీడీపీలో దళిత కులస్తులకు ప్రాధాన్యం లేదన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలపై మంత్రి జవహర్ మండిపడ్డారు. కిషోర్ బాబుకు మంత్రి పదవి పోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, రావెల మాటలు మేడిపండు సామెతలా ఉన్నాయని విమర్శించారు. టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావెలపై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా జవహర్ పేర్కొన్నారు.