china: చైనాకు ప్రధాని మోదీ... భారత్ కు చైనా అధ్యక్షుడు... ఈ ఏడాది అగ్రనేతల పర్యటనలు

షార్ట్స్‌లో చూడండి
చైనా కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత నేత, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ ఈ ఏడాది భారత్ లో పర్యటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన రాక కంటే ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. దీంతో అరుదైన పర్యటనలకు ఈ ఏడాది వేదికగా నిలవనుంది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఈ ఏడాది జూన్ లో చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

దీంతో 2015 నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం నాలుగో సారి అవుతుంది. అలాగే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఈ ఏడాది భారత్ లో పర్యటించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం. రానున్న నెలల్లో ఇరు దేశాల మధ్య అధికారుల స్థాయిలోనూ చర్చలు జరగనున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల మంత్రి యాంగ్ఈ కూడా రానున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించుకునే ప్రయత్నాలు కొనసాగనున్నాయి.
Go Back to Shorts
china
india

More Telugu News