Andhra Pradesh: ఏపీలో ఇద్దరు టీడీపీ కౌన్సిలర్ల రాజీనామా

  • మదనపల్లెలో టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి రాజీనామా
  • మునిసిపల్ కమిషనర్ కు రాజీనామా లేఖల అందజేత
  • వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు
  • అందుకే, రాజీనామా చేశాం : సుమంత్, తులసి
చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మునిసిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మునిసిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే, తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పారు. కాగా, అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Andhra Pradesh
Telugudesam

More Telugu News