rajesh sri chakravarthi: హీరోగా సంగీత దర్శకుడి వారసుడు వచ్చేస్తున్నాడు!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు పాటను పరుగులు తీయించిన సంగీత దర్శకులలో చక్రవర్తి ఒకరు. ఆయన తనయుడు 'శ్రీ' కూడా కొన్ని సినిమాలకి బాణీలను అందించి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఆయన కుమారుడు రాజేశ్ శ్రీ చక్రవర్తి హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు.

 ఆయన హీరోగా 'శివ కాశీపురం' రూపొందుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రాజేశ్ శ్రీ చక్రవర్తి జోడీగా ప్రియాంక శర్మ నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. సంగీత దర్శకుల కుటుంబం నుంచి వస్తోన్న రాజేశ్ శ్రీ చక్రవర్తి, హీరోగా ఎంతవరకూ రాణిస్తాడో చూడాలి మరి. 
Go Back to Shorts
rajesh sri chakravarthi

More Telugu News