Pawan Kalyan: జేఎఫ్‌సీ లోగో విడుదల చేసిన పవన్ కల్యాణ్

  • బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన నేపథ్యంలో జేఎఫ్‌సీ
  • లోగోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన జనసేనాని
  • ఇప్పటికే పలువురితో చర్చలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిన నేపథ్యంలో అన్ని విషయాలపై అధ్యయనం చేయడానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.. సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అనంతరం ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏపీకి ప్రత్యేక ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తామన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే ఆయన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురితో చర్చలు జరిపారు. నిజాలు నిగ్గు తేల్చుతామని పవన్ అన్నారు.  కాగా, ఈ రోజు ఆయన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ లోగో విడుద‌ల చేశారు. తన ట్విట్ట‌ర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జేఎఫ్‌సీ అని ఉంది. మీరూ చూడండి..
Pawan Kalyan
Andhra Pradesh
jfc
Jana Sena

More Telugu News