polavaram: పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

  • రూ.417.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటన   
  • మరోవైపు, ఏపీలో కొనసాగుతోన్న ఆందోళనలు
  • ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని టీడీపీ నేతల డిమాండ్
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు బంద్ పాటిస్తూ, నిరసనలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. పోలవరానికి నిధులు, విశాఖపట్నం రైల్వే జోన్‌ల విషయంలో న్యాయం చేయాలని, ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పోలరవం ప్రాజెక్టుకు ప్రస్తుతానికి రూ.417.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.   
polavaram
Andhra Pradesh
funds

More Telugu News