Chandrababu: శాఖాపర కేటాయింపుల్లో ఎక్కువ నిధులు రాష్ట్రానికి రాబట్టాలి: సీఎం చంద్రబాబు
- నీరు - ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్
- ఏ శాఖకు ఎన్ని నిధులొచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలి
- కార్యాచరణ సిద్ధం చేయాలి : చంద్రబాబు ఆదేశాలు
కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదని, అయినా మన సమర్థత చూపి శాఖాపర కేటాయింపులలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు తన నివాసం నుంచి నీరు - ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులు వచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. గరిష్టంగా కేంద్రం నుంచి ఎంత తెచ్చుకోవచ్చో అనే దానిపై శాఖా పరంగా కార్యాచరణ సిద్ధం చేయాలని, అమలు చేయాలని కోరారు.
నరేగా నిధులు రూ.7 వేల కోట్లు వినియోగించుకోవాలి
నరేగాకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రూ.55 వేల కోట్లు పెట్టినప్పటికీ, సప్లిమెంట్ గా మరో రూ.10 వేల కోట్లు కలిపి రూ.65 వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, ఈ ఏడాది నరేగా నిధులు రూ.7 వేల కోట్లు మన రాష్ట్రం వినియోగించుకోవాలని సూచించారు. నరేగా పనిదినాల సంఖ్య 23 కోట్లకు చేరుకోవాలని అన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, మెటీరియల్ కాంపొనెంట్ నిధుల వినియోగం 40% మించకుండా చూడాలని, లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. వాటర్ షెడ్స్ రెండవ దశ పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
రూ.10 వేల కోట్లలో ఎక్కువ ఏపీకే రాబట్టాలి
ఈ బడ్జెట్ లో క్షీర విప్లవం, నీలి విప్లవానికి రూ.10 వేల కోట్లు పైబడి కేటాయించిన అంశం ప్రస్తావించి, ఈ నిధులను రాష్ట్రంలోని ఆక్వా రైతాంగం, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మత్స్యరంగం, పశుసంవర్ధక రంగంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుకు ఈ నిధులు వినియోగించుకోవాలని, అన్ని జిల్లాలు పశుగ్రాసం సాగుపై దృష్టి పెట్టాలని, వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. మత్స్యశాఖను కూడా నరేగాకు అనుసంధానం చేసిన విషయం ప్రస్తావించి తీరప్రాంతం అధికంగా ఉన్న మన రాష్ట్రం దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో పంటకుంటలతో పాటు చేపల కుంటలకు కూడా నరేగా పథకాన్ని వినియోగించుకోవాలని, రైతుల ఆదాయాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఒక స్థాయికి చేరుకున్నాం - ఇకపై నిలకడ సాధించాలి
మూడున్నరేళ్లలో అనేక పనులు చేశామని, ఈ ఏడాది పనులలో స్థిరీకరణ రావాలని, సంతృప్తం కావాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పుడు మనం ఒక స్థాయికి చేరుకున్నామని, ఇకపై నిలకడ సాధించాలని పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్ లో ఏ పంటలు సాగు చేయాలో ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని, మేలు రకాలు సాగుచేయాలని, ఉత్పాదకత పెరగాలని, సాగు వ్యయం తగ్గాలని తద్వారా రైతుల నిజ ఆదాయాలు పెంచాలని కోరారు. మద్దతు ధరలపై కేంద్రం చేపట్టే విధానం వల్ల వరి ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండకపోవచ్చని, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, రాబోయే సీజన్ లో ఏ పంటలు సాగు చేస్తే ధరలు బాగుంటాయనే దానిపై రైతుల్లో ఇప్పటి నుంచే అవగాహన పెంచాలని సూచించారు.
గత రెండేళ్లలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉన్నా జలసంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, ఇన్ పుట్ సబ్సిడి, పంటల బీమా 95% పంపిణీ పూర్తయిందని తెలిపారు. సూక్ష్మపోషకాలు ఉచితంగా అందించడం వల్ల భూసారం పెరిగిందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హవుసింగ్ 2016-17లో 56% మాత్రమే పూర్తి చేశారని, 2017-18, 2018-19 ఇళ్ల పనులు వెంటనే ప్రారంభయ్యేలా శ్రద్ధ వహించాలని కోరారు. ఎన్టీఆర్ గ్రామీణ్ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హుద్ హుద్ తుపాన్ బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి చేయక పోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి పంచాయితీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి
ప్రతి నెలా ప్రతి పంచాయితీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోషకాహార లోపంపై గ్రామాల వారీగా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. రాష్ట్రంలో ఊబకాయం, పౌష్టికాహార లోపం సమస్యలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టి ఆయా సమస్యలను అధిగమించాలని, వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి అందిన వినతులన్నీ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గాలి స్వచ్ఛత (ఎయిర్ క్వాలిటి)పై అందరూ దృష్టి పెట్టాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు. ఇస్రో, కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు అన్నారు.
నరేగా నిధులు రూ.7 వేల కోట్లు వినియోగించుకోవాలి
నరేగాకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో రూ.55 వేల కోట్లు పెట్టినప్పటికీ, సప్లిమెంట్ గా మరో రూ.10 వేల కోట్లు కలిపి రూ.65 వేల కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ, ఈ ఏడాది నరేగా నిధులు రూ.7 వేల కోట్లు మన రాష్ట్రం వినియోగించుకోవాలని సూచించారు. నరేగా పనిదినాల సంఖ్య 23 కోట్లకు చేరుకోవాలని అన్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, మెటీరియల్ కాంపొనెంట్ నిధుల వినియోగం 40% మించకుండా చూడాలని, లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. వాటర్ షెడ్స్ రెండవ దశ పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
రూ.10 వేల కోట్లలో ఎక్కువ ఏపీకే రాబట్టాలి
ఈ బడ్జెట్ లో క్షీర విప్లవం, నీలి విప్లవానికి రూ.10 వేల కోట్లు పైబడి కేటాయించిన అంశం ప్రస్తావించి, ఈ నిధులను రాష్ట్రంలోని ఆక్వా రైతాంగం, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మత్స్యరంగం, పశుసంవర్ధక రంగంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మెరుగుకు ఈ నిధులు వినియోగించుకోవాలని, అన్ని జిల్లాలు పశుగ్రాసం సాగుపై దృష్టి పెట్టాలని, వేసవిలో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. మత్స్యశాఖను కూడా నరేగాకు అనుసంధానం చేసిన విషయం ప్రస్తావించి తీరప్రాంతం అధికంగా ఉన్న మన రాష్ట్రం దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామాలలో పంటకుంటలతో పాటు చేపల కుంటలకు కూడా నరేగా పథకాన్ని వినియోగించుకోవాలని, రైతుల ఆదాయాలు పెంచుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఒక స్థాయికి చేరుకున్నాం - ఇకపై నిలకడ సాధించాలి మూడున్నరేళ్లలో అనేక పనులు చేశామని, ఈ ఏడాది పనులలో స్థిరీకరణ రావాలని, సంతృప్తం కావాలని చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పుడు మనం ఒక స్థాయికి చేరుకున్నామని, ఇకపై నిలకడ సాధించాలని పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్ లో ఏ పంటలు సాగు చేయాలో ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని, మేలు రకాలు సాగుచేయాలని, ఉత్పాదకత పెరగాలని, సాగు వ్యయం తగ్గాలని తద్వారా రైతుల నిజ ఆదాయాలు పెంచాలని కోరారు. మద్దతు ధరలపై కేంద్రం చేపట్టే విధానం వల్ల వరి ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండకపోవచ్చని, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, రాబోయే సీజన్ లో ఏ పంటలు సాగు చేస్తే ధరలు బాగుంటాయనే దానిపై రైతుల్లో ఇప్పటి నుంచే అవగాహన పెంచాలని సూచించారు.
గత రెండేళ్లలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉన్నా జలసంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, ఇన్ పుట్ సబ్సిడి, పంటల బీమా 95% పంపిణీ పూర్తయిందని తెలిపారు. సూక్ష్మపోషకాలు ఉచితంగా అందించడం వల్ల భూసారం పెరిగిందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, ప్రకృతి సేద్యాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హవుసింగ్ 2016-17లో 56% మాత్రమే పూర్తి చేశారని, 2017-18, 2018-19 ఇళ్ల పనులు వెంటనే ప్రారంభయ్యేలా శ్రద్ధ వహించాలని కోరారు. ఎన్టీఆర్ గ్రామీణ్ లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హుద్ హుద్ తుపాన్ బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి చేయక పోవడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రతి పంచాయితీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి
ప్రతి నెలా ప్రతి పంచాయితీకి హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోషకాహార లోపంపై గ్రామాల వారీగా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. రాష్ట్రంలో ఊబకాయం, పౌష్టికాహార లోపం సమస్యలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టి ఆయా సమస్యలను అధిగమించాలని, వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి అందిన వినతులన్నీ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గాలి స్వచ్ఛత (ఎయిర్ క్వాలిటి)పై అందరూ దృష్టి పెట్టాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని కోరారు. ఇస్రో, కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు అన్నారు.