Pawan Kalyan: కదిరి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. చిత్రమాలిక

  • పవన్ కు ఆలయ అర్చకులు, అధికారుల ఘనస్వాగతం
  • నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని
  • పవన్ ని చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కదిరి నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కదిరి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన పవన్ తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 
Pawan Kalyan
kadiri

More Telugu News