'ఛలో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరూ!
- నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
- కథానాయికగా రష్మిక మందన
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- వచ్చేనెల 2వ తేదీన విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు సాయంత్రం 6:30 గంటలకు జరపనున్నారు. హైదరాబాద్ - యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరవుతూ ఉండటం విశేషం. నాగశౌర్య సొంత బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి, సాగర్ మహతి సంగీతాన్ని అందించారు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.