Pawan Kalyan: జనసేన అధిపతికి విజయీభవ : పరుచూరి గోపాలకృష్ణ

  • పవన్ కల్యాణ్  ప్రజాయాత్ర ప్రభంజన యాత్రగా మారాలి
  • ప్రజలకు హితం జరగాలి
  • పవన్ కు శుభాకాంక్షలు: ఓ ట్వీట్ లో పరుచూరి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిరంతర ప్రజా యాత్ర (చలోరే చలోరే చల్) ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు అంతా శుభం జరగాలని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ  కోరుకున్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘తరం తరం నిరంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్న జనం సమస్యలను తెలుసుకోడానికి పవన్ కల్యాణ్ ప్రారంభించిన ప్రజాయాత్ర ప్రభంజనయాత్రగా మారి, ప్రజలకు హితం జరగాలని కోరుకుంటున్నా.. జనసేనానికి శుభాకాంక్షలు.. విజయీభవ’ అని పరుచూరి కోరుకున్నారు.
Pawan Kalyan
Jana Sena

More Telugu News