jagan: 28న వైసీపీ 'వాక్ విత్ జగనన్న' కార్యక్రమం!

  • 1000 కి.మీ. పూర్తవనున్న పాదయాత్ర
  • ఈ సందర్భంగా వైసీపీ కార్యక్రమం
  • కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపడమే లక్ష్యం

ఈ నెల 28వ తేదీన వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. ఈ సందర్భంగా 'వాక్ విత్ జగనన్న' (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. అభిమానులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ఆ కార్యక్రమంలో భాగంగా దేశ, విదేశాల్లోని 700కు పైగా ప్రదేశాల్లో జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ రోజున పాదయాత్ర చేపట్టనున్నారు. ఏపీలోని 25 పార్లమెంటరీ కేంద్రాల్లో, 664 మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దివంగత రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించి, పాదయాత్రను ప్రారంభించాలని శ్రేణులకు పార్టీ పిలుపునిచ్చింది. 15 దేశాల్లోని 25 నగరాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

More Telugu News