bike accident: మ్యాన్‌హోల్‌లో బైక్‌తో పాటు పడిపోయిన వ్యక్తి.. ఆపై సజీవ దహనం!

  • ముంబ‌యిలో ఘటన
  • బైకు అదుపు తప్పడంతో ప్రమాదం
  • బైకులో మంటలు

మ్యాన్‌హోల్‌లో బైక్‌తో పాటు పడిపోయిన ఓ వ్యక్తి ఆపై సజీవ దహనమైన ఘ‌ట‌న ముంబ‌యిలో చోటు చేసుకుంది. బైక్‌ నుంచి మంటలు రావడంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని పోలీసులు గుర్తించారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఉల్వే ప్రాంతానికి చెందిన మోహన్‌ రాథోడ్‌ అనే వ్యక్తి  అర్ధరాత్రి బైక్‌పై వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పి బైక్‌తో పాటు మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. స్థానిక వ్యక్తి ఒకరు ఈ ప్రమాదాన్ని గమనించి తమకు సమాచారమిచ్చాడని, తాము అక్కడికి వచ్చే లోపే మోహన్ సజీవదహనమై పోయాడని పోలీసులు వివరించారు. 

More Telugu News