madhya pradesh: అందరూ చూస్తుండగా గుండ్లు గీయించుకున్న టీచర్లు!

షార్ట్స్‌లో చూడండి
త‌మ డిమాండ్ల ప‌రిష్కారం కోరుతూ మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో టీచ‌ర్లు పెద్ద ఎత్తున నిర‌స‌న దీక్ష‌కు దిగారు. అధ్యాప‌క్ అధికార్ యాత్ర పేరుతో స‌ర్కారుని క‌దిలించేలా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. ఉపాధ్యాయుల బ‌దిలీ, వేత‌నాలు వంటి ప‌లు స‌మ‌స్య‌ల‌పై వారు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. తమ స‌మ‌స్య‌ల‌పై విద్యాశాఖ చూపెడుతోన్న తీరు బాగోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ నిర‌స‌న‌లో భాగంగా ఈ రోజు ప‌లువురు టీచ‌ర్లు అంద‌రూ చూస్తుండ‌గా గుండు చేయించుకున్నారు. ఇప్ప‌టికైనా విద్యా శాఖ త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరారు.   
Go Back to Shorts
madhya pradesh
teachers
shave their head

More Telugu News