cell phone explosion: ఫోన్ పేలి ఐదుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

  • మహబూబాబాద్ జిల్లాలో పేలిన సెల్ ఫోన్
  • ధర్మారం తండాలో ఘటన
  • ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
సెల్ ఫోన్ బ్యాటరీలు పేలడం, జనాలు గాయపడటం తరచుగా జరుగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ బ్యాటరీ పేలిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
cell phone explosion

More Telugu News