KCR: దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనం నిర్మిస్తాం: మంత్రి తలసాని
దేశంలో మరెక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ పశుసంవర్థక, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కోకాపేటలో ఈ నెల 29న సీఎం కేసీఆర్ పర్యటించనున్న సందర్భంగా ఆయా ఏర్పాట్లను తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పది ఎకరాల స్థలంలో పది కోట్ల రూపాయలతో గొల్లకురుమల భవనాన్ని, హాస్టల్ ను నిర్మిస్తామని, సీబీఐటీ కళాశాల ప్రాంగణంలో గొల్ల కురుమల ప్రతినిధులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.