Al Khaida: కాశ్మీర్ విముక్తి కోసం ఢిల్లీ, కోల్ కతాల పని పడదాం పదండి!: అల్ ఖైదా డిప్యూటీ చీఫ్ వీడియో మెసేజ్

షార్ట్స్‌లో చూడండి
కాశ్మీర్ ను భారత్ నుంచి విముక్తి చేసేందుకు న్యూఢిల్లీ, కోల్ కతాలను మరుభూమిగా మార్చాలని ఆదేశిస్తున్న అల్ ఖైదా డిప్యూటీ చీఫ్ ఉసామా మెహమూద్ వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. బెంగళూరు, చెన్నై వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుని జీహాదీలు విరుచుకుపడాలని ఇందులో ఉసామా ఆదేశిస్తున్నాడు. భారత్ లో శాంతియుతంగా కనిపిస్తున్న నగరాలను వార్ జోన్ గా మార్చాలని చెప్పాడు.

ఇండియాలోని ముస్లింలంతా కాశ్మీర్ ప్రజలకు అండగా ఉండాలని, జీహాదీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరాడు. పనిలోపనిగా పాకిస్థాన్ కు వార్నింగ్ ఇస్తూ, ముజాహిద్దీన్ లను ఆ దేశ ప్రభుత్వం అడ్డుకుంటోందని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించాడు. కాగా, గతంలో అల్ ఖైదా విడుదల చేసిన ఓ ఆడియో టేపులో ప్రధాని నరేంద్ర మోదీని ముస్లిం వ్యతిరేకిగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Al Khaida
New Delhi
Kolkata
Chennai
Jehad
Jammu and Kashmir

More Telugu News