rk nagar: సీన్ రిపీట్.. ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపకం!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందడి ఊపందుకుంది. అన్ని పక్షాల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ, కొందరు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 12.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కొరుక్కుపేట్ లోని ఓ సైకోథెరపీ సెంటర్ లో డబ్బులు దాచారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

ఈ క్రమంలో డబ్బులు పంచుతుండగా కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది శశికళ బంధువు దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు ఉద్రిక్తతలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవానికి ఈ ఎన్నికలు ఏప్రిల్ 12నే జరగాల్సి ఉంది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగిన నేపథ్యంలో, అప్పుడు ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే నెలకొనడం గమనార్హం. డిసెంబర్ 21న ఉప ఎన్నిక జరగనుంది.   
Go Back to Shorts
rk nagar
rk nagar elections

More Telugu News