లోక్ సభ ఎంపీ: లోక్ సభ సభ్యుడు కమల్ నాథ్ కు రైఫిల్ గురిపెట్టిన కానిస్టేబుల్.. అడ్డుకున్న సెక్యూరిటీ!

  • మధ్యప్రదేశ్ లోని ఛిన్ లో సంఘటన
  • ఢిల్లీకి విమానం ఎక్కుతుండగా ఘటన
  • వెంటనే అప్రమత్తమైన కమల్ నాథ్ సెక్యూరిటీ
మధ్యప్రదేశ్ లోని ఛిన్ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్ నాథ్ కు తన సర్వీస్ రైఫిల్ ను ఓ కానిస్టేబుల్ గురిపెట్టిన సంఘటన కలకలం రేపింది. ఛిన్ లోని విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నిన్న ఆయన వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. కమల్ నాథ్ విమానం ఎక్కుతుండగా రత్నేష్ పవార్ అనే కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్ ను ఆయన వైపు గురిపెట్టడంతో, వెంటనే అప్రమత్తమైన కమల్ నాథ్ సెక్యూరిటీ అతన్ని అడ్డుకుని..పక్కకు తోసేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కానిస్టేబుల్ పవార్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించినట్టు ఏఎస్పీ నీరజ్ సోనీ పేర్కొన్నారు. కాగా, తనపై కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెక్కిన విషయం కమల్ నాథ్ దృష్టికి రాలేదు.
లోక్ సభ ఎంపీ
కమల్ నాథ్

More Telugu News