Chandrababu: పోలవరంకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను వెంటనే ఆన్ లైన్లో పెట్టండి: చంద్రబాబు ఆదేశం

  • మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమీక్ష
  • ఖర్చులు, నిధుల వివరాలను ఆన్ లైన్లో పెట్టండి
  • ప్రతి వివరం ఆన్ లైన్లో ఉండాలంటూ ఆదేశం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలన్నింటినీ ఆన్ లైన్లో ఉంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు ఆయన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు లెక్కలను ప్రస్తావించారు. ఇప్పటి వరకు అయిన మొత్తం వ్యయం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును ఆన్ లైన్ లో పొందుపరచాలని ఆదేశించారు. అలాగే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను కూడా పెట్టాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి వివరం ఆన్ లైన్లో ఉండాలని ఆదేశించారు.

More Telugu News