pakistan: అమెరికా అయినా వదిలిపెట్టేది లేదు... పాకిస్థాన్ గగనతలంలో డ్రోన్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు!

  • డ్రోన్లను కూల్చేయాలంటూ పాక్ వాయుసేనాధిపతి ఆదేశాలు
  • తమ గగనతలంలో ఉల్లంఘనల్ని అనుమతించబోమని స్పష్టం
  • ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాం
దేశ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లను కాల్పులు జరిపి వాటిని కూల్చివేయాలని పాకిస్థాన్ వాయుసేనాధిపతి సోహాలీ అమన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా అమెరికా డ్రోన్లను దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో అమెరికా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

2004 నుంచి అమెరికా ఈ పనిచేస్తుండగా... పాక్ మాత్రం తాజాగా కూల్చివేత నిర్ణయాన్ని తీసుకోవడం ఆశ్చర్యకరం. ‘‘మా గగనతంలోకి ఎవరైనా సరే చొరబడేందుకు అనుమతించం. డ్రోన్లను నేల కూల్చేయాలని దళాలకు ఆదేశాలు జారీ చేశాం. మా గగనతంలోకి అమెరికా డ్రోన్లు ప్రవేశించినా కూల్చేస్తాం’’ అని సోహాలీ అమన్ తెలిపారు.
pakistan
america drones

More Telugu News